యాదగిరిగుట్టలో ఘనంగా లక్ష పుష్చార్చన

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానంలో స్వామివారికి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన వైభవంగా నిర్వహించారు.

Update: 2024-10-13 07:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానంలో స్వామివారికి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. స్వామి వారి ఆలయ ముఖ మండపం నందు వైభవంగా పరిమళభరిత పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. అంతకుముందు స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ అనంతరవ బింద తీర్థంతో గర్భాలయ ప్రదక్షిణ నిర్వహించి పాలు, పెరుగు, పంచధార పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో నిజాభిషేకం వేదమంత్రాలతో శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అనంతరం బాలబోగం నివేదించారు. దసరా మరుసటి రోజు..ఆదివారం సెలవుదినం కావడంతో లక్ష్మినరసింహస్వామి స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీతో క్యూలైన్లు కిక్కిరిశాయి. 


Similar News