MP : మృతురాలి కుటుంబానికి అండగా ఉంటాం

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి శివారు మేఘ్య తండాకు చెందిన లకావత్ మౌనిక (23) శనివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది.

Update: 2024-10-20 09:05 GMT

దిశ,కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి శివారు మేఘ్య తండాకు చెందిన లకావత్ మౌనిక (23) శనివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సమాచారం తెలుసుకున్న మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ ఈరోజు మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి,అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. అదేవిధంగా ఉప్పరపల్లి గ్రామంలో బోనగిరి ఎల్లమ్మ మృతి చెందగా వారి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇదే గ్రామానికి చెందిన కోమటిరెడ్డి ముత్తిరెడ్డి ఇటీవలే మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, టిపిసిసి సభ్యులు దశ్రు నాయక్, సీనియర్ నాయకులు బండారు దయాకర్, చిదురాల వసంత్ రావు, వేముల శ్రీనివాస్ రెడ్డి, ఉపేందర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.


Similar News