Parakala MLA : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పరకాల

Update: 2024-09-17 10:25 GMT

దిశ, పరకాల : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, అమరధామం లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వం లో విలీనమైన రోజున రాష్ట్రంలో ప్రజా పాలన మొదలయిందని అందుకే సెప్టెంబర్ 17 న ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నదని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.


Similar News