జ‌ర్నలిస్టుల‌కు స‌హ‌క‌రిస్తా: క‌లెక్టర్ కృష్ణ ఆదిత్య..

సమాజంలో విలేక‌రుల పాత్ర చాలా ముఖ్యమైన‌ద‌ని ప్రభుత్వానికి, అధికారుల‌కు ప్రజల‌ స‌మ‌స్యల‌ను... Latest News

Update: 2023-03-08 10:42 GMT

దిశ, ఏటూరు నాగారం: సమాజంలో విలేక‌రుల పాత్ర చాలా ముఖ్యమైన‌ద‌ని ప్రభుత్వానికి, అధికారుల‌కు ప్రజల‌ స‌మ‌స్యల‌ను తెలియ‌జేయ‌డంలో విలేక‌రులు వారదిగా ముఖ్య పాత్ర పోషిస్తార‌ని ములుగు జిల్లా క‌లెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. బుద‌వారం అంత‌ర్జాతీయ మ‌హిళ దినోత్సవం సంద‌ర్భంగా ఏటూరునాగారం మండ‌ల కేంద్రంలో ఉప ఆరోగ్య కేంద్రంను ప్రారంభించాడానికి వ‌చ్చిన క‌లెక్టర్ కృష్ణ ఆదిత్యను నూత‌న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అఫ్జల్ పాషా, ప్రధాన కార్యద‌ర్శి అలువాల శ్రీ‌నివాస్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ స‌భ్యులు క‌లెక్టర్‌ను క‌లవ‌డం జ‌రిగింది.

ఈ సంద‌ర్బంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అష్జల్ పాషా క‌లెక్టర్‌తో మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ భ‌వ‌నం కోసం స్థలాన్ని కేటాయించాల‌ని, అంతేకాకుండా గతంలో కూడా ప్రెస్ క్లబ్ భ‌వ‌నం కోసం ద‌రాఖాస్తు చేసుకున్నామ‌ని క‌లెక్టర్ కు తెల‌ప‌డం జ‌రిగింది. కాగా ఈ మేర‌కు వెంట‌నే స్పందించిన క‌లెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రెస్‌క్లబ్ భ‌వ‌న నిర్మాణం కోసం స్థలం కేటాయించ‌డం జ‌రిగింది.. అంతేకాకుండా ప్రెస్ క్లబ్ భ‌వ‌న నిర్మానం కోసం కావాల‌సిన‌ కార్యక్రమాల‌ను త‌క్షణ‌మే అమ‌లు ప‌రుచాల‌ని స్థానికి మండ‌ల త‌హ‌సీల్దార్‌కు సంజీవ‌య్యకు అదేశాలు జారీ చేశారు. అనంత‌రం క‌లెక్టర్ కృష్ణ అదిత్య మాట్లాడుతూ నూత‌న ప్రెస్‌క్లబ్ అధ్యక్షుల‌కు, ఉపాద్యాక్షుల‌కు, కార్యవ‌ర్గ స‌భ్యుల‌కు, ప్రెస్‌క్లబ్ నిర్వహ‌కుల‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News