మార్కెట్‌ ఇలానేనా..అధికారులపై జేడీఎం సీరియస్‌

వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌ను జేడీఎం శ్రీనివాస్‌

Update: 2024-09-21 15:01 GMT

దిశ,వరంగల్‌ టౌన్ : వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌ను జేడీఎం శ్రీనివాస్‌ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.మార్కెట్ లోని అన్ని యార్డులు, పరిసర ప్రాంతాలు కలియతిరిగారు. అపరిశుభ్రంగా ఉన్న యార్డులను చూసి అసహనం వ్యక్తం చేశారు. శుభ్రం చేయడం లేదా అంటూ అధికారులను ప్రశ్నించారు.సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పరిశుభ్రత పాటించాలని పలు సూచనలు చేశారు. పత్తి విక్రయ సమయాల్లో చేయవలసినవి,చేయరానివి అంటూ బోర్డు పెట్టారు.అది కాస్తా జంగ్ పట్టి అక్షరాలు కనిపించక పోవడం చూసి కోపగించుకున్నారు. సరి చేయించాలని ఆదేశించారు. అనంతరం మార్కెట్ కార్యాలయానికి చేరుకున్న ఆయన గతంలో జరిగిన లావాదేవీలు, ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న సరుకులు, వాటి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.


Similar News