ములుగును ఉన్నతంగా తీర్చదిద్దుతా.. సీతక్క ప్రకటన

Update: 2024-08-15 14:35 GMT

దిశ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాను రాష్ట్రంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతానంటూ మంత్రి సీతక్క ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖల మంత్రి సీతక్క వచ్చి పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం జంగాలపల్లి క్రాస్ రోడ్ వద్ద ఇంటి ఇంటికి జెండాలు పంపిణీ చేశారు. అనంతరం రామప్పలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Tags:    

Similar News