George Kurian : ప్రపంచ దేశాల్లో అతి పెద్ద శక్తిగా భారత్..

హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి

Update: 2024-09-21 14:18 GMT

దిశ,హనుమకొండ టౌన్ : హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, ఫిషరీస్, మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారత దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రపంచ దేశాల్లో అతి పెద్ద శక్తిగా రూపు దిద్దుకుందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అని, ఈ పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ కి నేను సౌత్ ఇండియా ఇంచార్జి గా వ్యవహరిస్తున్నారన్నారు.

దేశంలోని యువత బీజేపీ వెంట ఉందని తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మెంబెర్ షిప్ చేయడం లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, అరూరి రమేష్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, రాష్ట్ర నాయకులు పేసరు విజయ్ చందర్ రెడ్డి, గుజ్జ సత్యనారాయణ రావు, పగడాల కాళీ ప్రసాద్, పులి సరోత్తం రెడ్డి, చందుపట్ల రాజారెడ్డి, జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇంచార్జి గుండగోని భరత్ గౌడ్, జిల్లా నాయకులు కొలను సంతోష్ రెడ్డి, కొండ జితేందర్ రెడ్డి, డి. అమర్నాథ్ రెడ్డి, గురిజల శ్రీరాం రెడ్డి, నర్మెట్ట శ్రీనివాస్, దోపుచర్ల అర్చన మధు సుధన్ రావు, కందగట్ల సత్యనారాయణ, సండ్ర మధు, చాంద్ పాషా, జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Similar News