అధైర్య పడొద్దు.. అండగా ఉంటాంః ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి

Update: 2024-09-02 13:30 GMT

దిశ, తొర్రూరు: మూడు రోజులుగా బారి వర్షాలు కురుస్తున్న నేపత్యంలో మండలంలో పలు గ్రామాలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి పరిశీలించారు. సోమవారం తొర్రూర్ మండలం నాంచారి మడురు గ్రామానికి చెందిన వంగల మల్లరెడ్డికి చెంది 30 ఎకరాల బొప్పాయి తొట్ట పూర్తిగా నేలమట్టం కాగా ఎమ్మెల్యే పంట నష్టాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఇతర రైతులతో కూడా మాట్లాడి రైతులు అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉందని ధైర్యం నింపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యనాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News