మంత్రాలు చేశాడనే నెపంతో దాడి.. వ్యక్తి మృతి, నిందితుడి అరెస్ట్.

Update: 2024-09-27 14:08 GMT

దిశ, ఇనుగుర్తి (నెల్లికుదురు): మంత్రాల చేశాడనే నెపంతో వ్యక్తిపై దాడి చేసి హత్య చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది.

ఈ ఘటనపై తొర్రుర్ సీఐ జగదీష్, నెల్లికుదురు ఎస్సై రమేష్ బాబు వివరాలు తెలుపుతూ.. ఇనుగుర్తి మండలంలోని చిన్న ముప్పారం గ్రామానికి చెందిన మల్లం యాకయ్య (60) అనే వ్యక్తి మంత్రాలు చేశాడనే అనుమానంతో అతనిపై దాడి చేశారు. శుక్రవారం ఉదయం సుమారు 6:30 లకు అదే గ్రామానికి చెందిన మల్లం రాజు, ముత్యాలమ్మ గుడి వద్ద మంచంపట్టెతో తలపై కొట్టి చంపాడాని, మృతుని కొడుకు మల్లం రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి వెళ్లి విచారించి మల్లంరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని సీఐ తెలిపారు.


Similar News