తహశీల్దార్ కార్యాలయంలో పాము కలకలం..

ప్రభుత్వ కార్యాలయంలో పాము కలకలం సృష్టించింది.

Update: 2024-09-26 09:24 GMT

దిశ, కొత్తగూడ : ప్రభుత్వ కార్యాలయంలో పాము కలకలం సృష్టించింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల తహశీల్దార్ కార్యాలయంలో ఒక్కసారిగా పాము కనిపించడంతో గురువారం ఉదయం విధులకు హాజరైన ఉద్యోగులంతా షాక్ కు గురయ్యారు. వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్న ఉద్యోగులకు, తహశీల్దార్ ఛాంబర్ లోని ముందు గదిలో పాము కనిపించడంతో కంగారుతో పరుగులు తీశారు.

కాగా.. కొద్ది సమయం తరువాత సమయస్ఫూర్తితో పాముని పట్టుకొని పక్కనే ఉన్న అడవిలో వదిలేశారు. అయితే.. క్రీస్తు పూర్వంలో నిర్మించిన తహశీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరడమే దీనికి కారణం. అంతేకాకుండా చుట్టూ ప్రహరీ లేకపోవడం వల్ల కూడా తరుచూ విషసర్పాలు, క్రిమి కీటకాలు కార్యాలయంలోకి చేరుతున్నాయని వాపోతున్నారు అక్కడి ఉద్యోగులు.


Similar News