విద్యుత్ షాక్ తో 3 గేదెలు మృతి

Update: 2024-08-18 10:55 GMT

దిశ, నర్మేట్ట : మండలంలోని వెల్దండ గ్రామంలో ప్రమాదవశాత్తు పాడి గేదెలు ఆదివారం మరణించాయి. వివరాల్లోకివెళ్తే.. వెల్డండ గ్రామానికి చెందిన రైతు వంగ భూపాల్ రెడ్డి పశువులను మేతకు తీసుకు వెళ్లాడు. వెళ్లే మార్గ మధ్యలో కరెంటు తీగలు తెగి కింద పడి ఉన్నాయి. వాటిని గమనించని రైతు.. గేదెలను తప్పించలేదు. దాంతో ఆ తీగలు తగిలి మూడు గేదెలు ఒక దూడ అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు నాలుగు లక్షలు నష్టపోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News