Vemulawada : రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది.

Update: 2024-06-10 06:13 GMT

దిశ, వేములవాడ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారంతో పాటు వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కోడెలను కట్టేసి, తదనంతరం శ్రీ పార్వతి-రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు అధిక సంఖ్యలో భక్తుల రాకతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి సుమారు 5గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.


Similar News