Minister Ponnam's : దీపావళికి మట్టి దీపాంతలు వాడండి : మంత్రి పొన్నం పిలుపు

దీపావళి(Diwali) సందర్భంగా దీపాలు వెలిగించేటప్పుడు మట్టి(clay lamps)తో తయారు చేసిన దీపాంతలు వాడాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)ప్రజలకు విజ్ఞప్తి చేశారు

Update: 2024-10-28 06:02 GMT

దిశ, వెబ్ డెస్క్ : దీపావళి(Diwali) సందర్భంగా దీపాలు వెలిగించేటప్పుడు మట్టి(clay lamps)తో తయారు చేసిన దీపాంతలు వాడాలని తెలంగాణ రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మట్టి ప్రమిదలను వాడటం ద్వారా పర్యావరణానికి ,ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని.. కుల వృత్తులను రక్షించినట్టు ఉంటుందని తెలిపారు.

మట్టితో తయారు చేసిన ఉత్పత్తులను వాడటం వల్ల గ్రామీణ కుల వృత్తులను, సంబంధిత వృత్తిదారుల ఉపాధిని ప్రొత్సహించినట్లవుతుందన్నారు. హస్తకళలు, చేతి వృత్తులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  

Tags:    

Similar News