G. Kishan Reddy : సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి టెర్మినల్.. రోడ్ల విస్తరణకు సహకారం అందించాలని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Update: 2024-09-09 09:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి టెర్మినల్.. రోడ్ల విస్తరణకు సహకారం అందించాలని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవానికి మోడీ వస్తారు. వీలైనంత త్వరగా రోడ్లను పూర్తిచేయాలని కోరారు. కాగా, ఇటీవల తెలంగాణలో కేంద్ర రైల్వేశాఖ సహాయ రన్విత్‌ సింగ్‌ బిట్టు పర్యటించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి టెర్మినల్.. రోడ్ల విస్తరణకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రూ.700కోట్ల వ్యయంతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. నిర్మాణ పనులు 2026 నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యమని చెప్పారు.


Similar News