బీజేపీ గెలిస్తే ఆ వర్గానికే సీఎం పోస్ట్.. కేంద్రమంత్రి అమిత్ షా సంచలన ప్రకటన

బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్ష్యం కుటుంబ రాజకీయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. శుక్రవారం సూర్యాపేటలో బీజేపీ తలపెట్టిన జనగర్జన సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా

Update: 2023-10-27 11:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్ష్యం కుటుంబ రాజకీయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. శుక్రవారం సూర్యాపేటలో బీజేపీ తలపెట్టిన జనగర్జన సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. కేటీఆర్‌ను సీఎం చేయడం కేసీఆర్ లక్ష్యం.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం సోనియా గాంధీ లక్ష్యమని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ, గరీబ్ కల్యాణ్ అనేది బీజేపీ లక్ష్యమని అన్నారు. ఈ రెండు పార్టీలు కుటుంబ కోసం పని చేసే పార్టీలని మండిపడ్డారు. బీఆర్ఎస్ పేదలు, బీసీల వ్యతిరేక పార్టీ అని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని అమిత్ షా సంచలన ప్రకటన చేశారు.

Tags:    

Similar News