కేబుల్ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకుల స్పాట్ డెడ్

ఆదివారం తెల్లవారుజామున దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే చనిపోయారు.

Update: 2024-08-04 12:45 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆదివారం తెల్లవారుజామున దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే చనిపోయారు. అతివేగం, నిర్లక్ష్యం మూలంగా నిండు ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోహిత్, ఉద్యోగం వెతుక్కోవడానికి ఇక్కడికి వచ్చిన తన స్నేహితుడు బాల ప్రసన్నతో కలిసి ఈ తెల్లవారుజామున మసీద్ బండ నుండి హఫీజ్ పేట వైపు బైక్ మీద వెళ్తున్నారు. కొత్తగూడ ఫ్లైఓవర్ మీద అతివేగంగా, నిర్లక్ష్యంగా బైక్ నడపడంతో అదుపు తప్పి ఫ్లైఓవర్ గోడను ఢీకొని ఫ్లైఓవర్ మీది నుండి కింద పడ్డారు. ఇద్దరికీ తీవ్ర గాయాలవ్వడంతో హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ నిమిషాల వ్యవధిలో ఇద్దరూ మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్ కు తరలించిన గచ్చిబౌలి పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  


Similar News