Transfers: 9 మంది సూపరింటెండింగ్ ఇంజినీర్ల బదిలీలు
ఎస్పీడీసీఎల్ పరిధిలో 9 మంది సూపరింటెండింగ్ ఇంజినీర్లు బదిలీ అయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్పీడీసీఎల్ పరిధిలో 9 మంది సూపరింటెండింగ్ ఇంజినీర్లు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ బదిలీలు జరిగాయి. సంగారెడ్డిలో ఎస్ఈగా పని చేసిన మాధవరెడ్డికి సరూర్నగర్కు బదిలీ చేశారు. బంజారాహిల్స్లో ఎస్ఈగా పనిచేసిన చంద్రశేఖర్ను సైబర్ సిటీకి బదిలీ చేశారు. సైబర్ సిటీ ఎస్ఈగా పని చేసిన వెంకన్నను హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్కు ట్రాన్స్ఫర్ చేశారు. మేడ్చల్ ఎస్ఈగా విధులు నిర్వర్తించిన శ్రీరామ్ మోహన్ను రాజేంద్ర నగర్కు బదిలీ చేశారు. యాదాద్రిలో ఎస్ఈగా పని చేసిన శ్రీనాథ్ను సంగారెడ్డికి బదిలీ చేశారు. రాజేంద్రనగర్ ఎస్ఈగా ఉన్న గోపయ్యను సికింద్రాబాద్ ఎస్ఈగా ట్రాన్స్ఫర్ చేశారు. సికింద్రాబాద్ ఎస్ఈగా ఉన్న రవికుమార్ను మేడ్చల్కు, సరూర్నగర్ ఎస్ఈగా ఉన్న కరుణాకర్ బాబును బంజారాహిల్స్కు, బంజారాహిల్స్లో డివిజనల్ ఇంజినీర్గా పని చేసి ఇటీవల ఎస్ఈగా పదోన్నతి పొందిన సోమిరెడ్డిని హైదరాబాద్ సౌత్ సర్కిల్ ఎస్ఈగా బదిలీ చేశారు.