గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖిలో తుమ్మల

గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హాజరయ్యారు.

Update: 2024-10-07 06:18 GMT

దిశ, వెబ్ డెస్క్ : గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హాజరయ్యారు. గాంధీభవన్ ముఖాముఖి కార్యక్రమానికి ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలపై తుమ్మలకు వినతులు అందించారు. ఎక్కువగా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి తుమ్మలను కలిసేందుకు వచ్చారు. ఉదయం 11 నుంచి 2 గంటల వరకు ముఖాముఖి కొనసాగనుంది. వారంలో రెండు రోజులు బుధ, శుక్రవారాల్లో మూడు గంటల పాటు గాంధీభవన్‌లో మంత్రులు అందుబాటులో ఉండనున్నారు.

ఇప్పటికే మొదటి రోజు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నర్సింహ, రెండో రోజు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం జరగాల్సిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తన సొంత జిల్లా నిజామాబాద్ లో పర్యటించడంతో సోమవారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. 


Similar News