MLCగా తీన్మార్ మల్లన్న విజయం.. రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నకు ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్ తెలిపారు.

Update: 2024-06-08 07:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నకు ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్ తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిగా శాసనమండలికి ఎన్నికైన చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న)కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు తెలిపారు. కాగా, తీన్మార్ మల్లన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలపై ప్రశ్నించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఇదే స్థానంలో ఆనాడు గెలిచిన పల్లారాజేశ్వర్ రెడ్డికి టఫ్ ఫైట్ ఇచ్చారు. తాజాగా ఆయన గెలుపుతో ఆయన అభిమానులు సంబరాలకు సిద్ధం అవుతున్నారు.


Similar News