పోలీస్ స్టేషన్కు కేటాయించిన స్థలం కబ్జా
హైదరాబాద్లో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. సామాన్యుల స్థలాలే కాకుండా ఏకంగా ప్రభుత్వ భూములకు కూడా ఎసరు పెడుతున్నారు.
దిశ, వెబ్డెుస్క్: హైదరాబాద్లో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. సామాన్యుల స్థలాలే కాకుండా ఏకంగా ప్రభుత్వ భూములకు కూడా ఎసరు పెడుతున్నారు. తాజాగా.. నగరం నడిబొడ్డున చార్మినార్ పోలీస్ స్టేషన్(Charminar Police Station) నిర్మాణం కోసం కేటాయించిన 700 గజాల స్థలం కబ్జాకు గురైంది. అంతేకాదు.. ఆ స్థలంలో దర్జాగా నిర్మాణలు చేపట్టారు. వెంటనే పనులు నిలిపివేయాలన్న పోలీసుల హెచ్చరికలనూ లెక్కచేయడం లేదు. దీంతో స్థలం కబ్జా చేసిన ఐదుగురిపై కేసు నమోదు చేసిన చార్మినార్ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.