అంతటి రామోజీరావును వణికించిన ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్

ఎన్నో రంగాల్లో తన సత్తాను చాటుతూ వచ్చిన రామోజీ రావు గురించి ఎంత చెప్పిన తక్కువే.

Update: 2024-06-08 13:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో రంగాల్లో తన సత్తాను చాటుతూ వచ్చిన రామోజీ రావు గురించి ఎంత చెప్పిన తక్కువే. సామాన్యుడి నుంచి పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగిన గొప్ప వ్యక్తి. ఈయన పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది ముందుగా ఈనాడు మీడియా సంస్థలు. తాను ఎదుగుతూ లక్షలాది మందికి ఉద్యోగ కల్పన అందించిన మంచి మనసున్న వ్యక్తి. రామోజీ రావు గురించి చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఎంతో మందికి ఉపాధి కల్పించిన గొప్ప ధీరుడు నేడు మరణించడం చాలా బాధకరణం అని చెప్పుకోవచ్చు. రామోజీ ఏ వ్యాపారం స్టార్ట్ చేసిన.. అందులోలాభం వచ్చిన నష్టం వచ్చిన వెనకడుగు వేయలేదు.

అలాంటి రామోజీరావును ఓ వ్యక్తి మాత్రం వణికించారట. ఆ వ్యక్తి ఎవరో కాదు.. ఉండవల్లి అరుణ్ కుమార్ అట. రామోజీరావు స్థాపించిన మార్గదర్శి చిట్ ఫండ్ లో ఎన్నో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఇష్యూలో ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టులో పిటిషన్ వేశారట. దీనిపై జగన్ సర్కార్ ఏపీ సీఐడీ పోలీసులను కూడా విచారణకు ఆదేశించింది. ఇక అదే సమయంలో రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్ కు సంబంధించి అనేక తనిఖీలు జరిగాయట. రామోజీరావు ఈ ఇష్యూ గురించి భయపడి.. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పి వీడియో విడుదల చేశారని సమాచారం. ఆ విధంగా రామోజీరావును ఉండవల్లి అరుణ్ కుమార్ కాస్త ఇబ్బందులు పెట్టినట్లు నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు. 

Tags:    

Similar News