భవిష్యత్తు యువతరానిదే.. కాసాని జ్ఞానేశ్వర్
భవిష్యత్ యువతరానిదేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : భవిష్యత్ యువతరానిదేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్రంలో ప్రజా ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం జహీరాబాద్ పార్లమెంట్, వరంగల్ తూర్పు, నిర్మల్ జిల్లాల నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి బీదవాడిని కోటీశ్వరున్ని చేయాలన్న ఉద్దేశమే టీడీపీ లక్ష్యం అన్నారు.
ప్రజలకు నేడు తెలుగుదేశం పార్టీ ఎంతో అవసరం.. తెలుగుదేశం జెండా కోసం ఎదురుచూస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పుట్టిన నాటి నుండి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పార్టీ తెలుగుదేశం అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కిలి ఐలయ్య, జహీరాబాద్ పార్లమెంట్, వరంగల్ తూర్పు, నిర్మల్ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.