ఒక్కసారిగా ఢిల్లీ బాట పట్టిన టీ-బీజేపీ ఎంపీలు.. ఎందుకంటే..?

బీజేపీ ఎంపీలు ఢిల్లీకి పయనమయ్యారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే

Update: 2024-06-23 15:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఎంపీలు ఢిల్లీకి పయనమయ్యారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు హస్తిన బాటపట్టారు. సోమవారం పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో ఒక్కొక్కరుగా ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్‌లో సుడిగాలి పర్యటన అనంతరం ఢిల్లీకి వెళ్లారు. అలాగే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, పాలమూరు ఎంపీ డీకే అరుణ సైతం ఆదివారం బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఇతర ఎంపీలు సైతం ఒక్కొక్కరుగా హస్తిన బాట పడుతున్నారు.


Similar News