ఈనెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

బీఏసీ సమావేశం ముగిసింది.

Update: 2024-07-23 08:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈ రోజుతో కలిపి మొత్తం 8 రోజుల పాటు సెషన్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు. రేపు రైతు రుణమాఫీపై అసెంబ్లీలో చర్చించనున్నారు. ఎల్లుండి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 31వ తేదీన బడ్జెట్ కు శాసనసభ ఆమోదం తెలుపనున్నది. కాగా ఈ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ బిల్లును తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. అలాగే జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధివిధానాలు, రేషన్ కార్డు విధివిధానాలపై శాసనసభలో ప్రకటన చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం అంశాలపై సైతం చర్చించనున్నట్టు సమాచారం.

Tags:    

Similar News