తెలంగాణ ఉద్యమకారులకు ప్రొ. కోదండరామ్ కీలక హామీ

తెలంగాణ ఉద్యమకారులకు ప్రొ. కోదండరామ్ కీలక హామీ ఇచ్చారు. బుధవారం సంగారెడ్డిలో తెలంగాణ ఉద్యమకారుల సదస్సు జరిగింది. ఈ

Update: 2024-06-19 10:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యమకారులకు ప్రొ. కోదండరామ్ కీలక హామీ ఇచ్చారు. బుధవారం సంగారెడ్డిలో తెలంగాణ ఉద్యమకారుల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొ. కోదండరాం మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన ఉద్యమకారులకు పెన్షన్‌తో పాటు ఇంటి స్థలం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ నిధులను దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆస్తి అని.. కానీ కేసీఆర్ కుటుంబం సొంత ఆస్తిలా అనుభవించారని విమర్శించారు. విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్ జరుపుతోన్న విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. 


Similar News