అనుమానాస్పదంగా వ్యక్తి మృతి...

కేసముద్రం మండలంలోని పెనుగొండ గ్రామంలో అనుమానాస్పదంగా ప్రశాంత్ (30) అనే ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పెనుగొండ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.

Update: 2024-10-11 15:49 GMT

దిశ,కేసముద్రం: కేసముద్రం మండలంలోని పెనుగొండ గ్రామంలో అనుమానాస్పదంగా ప్రశాంత్ (30) అనే ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పెనుగొండ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... కడప జిల్లాకు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి సుమారు నాలుగు,ఐదు నెలల క్రితం పెనుగొండ గ్రామానికి వచ్చి సుతారి మేస్త్రి గా పనిచేస్తున్నారు. అదే జిల్లాకు చెందిన ఓ యువతని కులాంతర వివాహం చేసుకున్న మృతుడు ప్రశాంత్ కు తన భార్యపై అనుమానం కలగడంతో తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరిగేవి. ప్రశాంత్ కు జ్వరం వచ్చిందని శుక్రవారం తెల్లవారుజామున ఓ ఆటోలో ఆయనను మహబూబాబాద్ కు తరలిస్తుండగా ప్రశాంత్ పరిస్ధితిపై అనుమానం కలిగిన ఆటో డ్రైవర్ మార్గ మధ్యలో 108 వాహనానికి సమాచారం అందించారు. వెంటనే 108 వాహనం అక్కడ చేరుకొని ప్రశాంత్ ను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించి పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.కాగా ప్రశాంత్ మృతికి గల కారణాలను పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.


Similar News