ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్.. వెలుగులోకి సంచలన విషయాలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్కు గురైన ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు అంశంలో కీలక విషయాలు వెలుగు చూశాయి.

దిశ, వెబ్డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్కు గురైన ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు అంశంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఎస్ఐబీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. 42 హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను ప్రణీత్ రావు తగులబెట్టినట్లు నిర్ధారించారు. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు.. కాల్ రికార్డులు ఐఎంఈ నెంబర్లు ధ్వంసం చేసినట్లు గుర్తించారు.
ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు తేల్చారు. డేటాబేస్లోని మొత్తం డేటాను ప్రణీత్ రిమూవ్ చేసినట్లు గుర్తించారు. ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి.. రికార్డులను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు తేలింది. అయితే ప్రణీత్ రావు గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ డీఎస్పీగా పనిచేస్తూ దాదాపు 30 మంది పోలీసు సిబ్బందితో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఉండగా రూల్స్ అతిక్రమించినట్లు తేలగా ఆయనపై సోమవారం సస్పెన్షన్ వేటు పడింది. ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలు సహా మాజీ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించిన వారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందగా.. ఇంటర్నల్ ఎంక్వైరీలో రూల్స్ బ్రేక్ చేసినట్లు తేలడంతో ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు.