సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్

Update: 2024-10-03 15:04 GMT

దిశ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుల ఫాంహౌస్ లు కూల్చాలా? వద్దా?' అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సబిత ట్విటర్ వేదికగా స్పందించారు. ఆత్మాభిమానం కన్నా మించిన ఆస్తి లేదని నమ్మిన వ్యక్తినని చెప్పారు. " సీఎంగానీ, ఇంకెవరైనా వ్యక్తుల ముందుగానీ ' పేద ఏడుపులు ఏడ్చిన సందర్భం నాకు దేవుడు కలిగించలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని, ఆయన మాట తీరుని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. మా అబ్బాయి కడుతున్న 'ఇల్లు' మినహాయించి, మిగతా మూడు ఫాంహౌస్ లు ఎక్కడ ఉన్నాయో బయటపెట్టండని, వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా టార్గెట్ చేసినా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటా" అని సబితా ఇంద్రారెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు. అంతకుముందు సబితా సహా బీఆరెఎస్ మాజీ మంత్రులు, నాయకులు తమ అక్రమ నిర్మాణాలను కాపాడుకునేందుకు మూసీ నది ప్రక్షాళన బాధితులకు మద్దతు ముసుగులో రాజకీయం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 


Similar News