చేప పిల్లల పంపిణీ స్కీమ్లో రూ.100ల కోట్ల స్కామ్: మెట్టు సాయికుమార్
చేప పిల్లల స్కీమ్లోనూ బీఆర్ఎస్ దోపిడికి పాల్పడిందని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆరోపించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: చేప పిల్లల స్కీమ్లోనూ బీఆర్ఎస్ దోపిడికి పాల్పడిందని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆరోపించారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మాట్లాడుతూ.. చేప పిల్లల పంపిణీ కాంట్రాక్ట్లో వందల కోట్ల స్కామ్ జరిగిందన్నారు. బీఆర్ఎస్ లోకి కీలక నేతలందరికీ వాటాలు అందాయని వివరించారు. త్వరలోనే ఆ వివరాలు బయటకు తీస్తామన్నారు. విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. సంపూర్ణ విచారణ తర్వాత బీఆర్ఎస్ నేతల చిట్టా బయటకు తీస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ స్కీమ్లో స్కామ్ జరిగిందని ఆరోపించారు. అన్ని శాఖల్లోని అవినీతి, స్కామ్ లపై ఆధారాలతో బయట పెడతామని వెల్లడించారు.