Revanth Reddy: అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా సీఎం ఘన నివాళులు

భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు.

Update: 2024-10-15 07:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో కలాం చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు మేం నరేందర్ రెడ్డి పాల్గొని కలాంకు నివాళులు అర్పించారు. అంతకుముందు ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి.. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించి, దేశ రక్షణ దిశను మార్చి, క్షిపణి పితామహుడయ్యాడని కలాంను కొనియాడారు. అంతేగాక అంతరిక్ష పరిశోధనల్లో ఇండియా కలలకు రెక్కలు తొడిగారని, ప్రజల రాష్ట్రపతిగా, యువతకు స్పూర్తి మంత్రంగా నిలిచిన అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వినమ్ర నివాళి అని రాసుకొచ్చారు. 



 



Similar News