పోస్టింగ్ ఇవ్వండి.. CMకు గురుకుల బోర్డు నియామకపత్రాలు పొందిన అభ్యర్థుల రిక్వెస్ట్

గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డుకు ఎంపికై.. నియామకాలు పొందిన అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.

Update: 2024-06-14 17:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డుకు ఎంపికై.. నియామకాలు పొందిన అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఈనేపథ్యంలో సీఎం తన నివాసంలో లేకపోవడంతో ఆయన పీఏ జైపాల్ రెడ్డికి వినతి అందించినట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. ఇన్ని రోజులు ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేశారని, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఎత్తివేశారని, ఇప్పటికైనా నియామకమైన వారికి పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.


Similar News