BREAKING: మహిళలకు గుడ్ న్యూస్.. రేపటి నుండే బస్సుల్లో ఉచిత ప్రయాణం స్టార్ట్
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి స్కీమ్ను డిసెంబర్ 9వ తేదీ నుండి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్ల అమలుకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించింది. వయసుతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర బార్డర్ల వరకు మహిళలు, ట్రాన్స్ జెండర్లు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. రేపటి నుంచి ఈ స్కీమ్ ప్రారంభంకాబోతున్నదని ప్రభుత్వం ప్రకటించింది.
మార్గదర్శకాలు:
-వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల బాలికలు మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఉచిత ప్రాయాణం
-తెలంగాణ పరిధి వరకు మహిళకు ఉచిత సర్వీసులు
-పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం
-ఫ్రీ జర్నీ ఖర్చులను ఆర్టీసీకి ప్రభుత్వం రియంబర్స్ చేస్తుంది
-భవిష్యత్ లో ఫ్రీ జర్నీ కోసం సాఫ్చ్ వేర్ ఆధారిరిత మహా లక్ష్మి స్మార్ట్ కార్డు అందజేత
-ఆర్టీసీ అధికారులు ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటారు.