Release of funds: నేతన్నలకు భారీ గుడ్న్యూస్.. చేయూత పథకం కింద రూ.90 కోట్లు విడుదల
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్నకు చేయూత పథకం కింద రూ.90 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నేతన్న అభ్యున్నతిని పట్టించుకోలేదని ఆరోపించారు. అదేవిధంగా చేతన్న చేయూత పథకం కింద బకాయి పెట్టిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలాంటి బకాయిలు లేకుండా నిధులు విడుదల చేశామని అన్నారు. చేనేత కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది గోరంత.. చెప్పుకున్నది గోరంత అని ఎద్దేవా చేశారు. నేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.