డిగ్రీ చేయాలనుకునే విద్యార్థులకు బిగ్ అలర్ట్

డిగ్రీ ప్రవేశాలకు గాను దోస్త్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను కాలేజీ విద్యాశాఖ కమిషనర్ దేవసేన సోమవారం ప్రకటించింది.

Update: 2024-09-23 16:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: డిగ్రీ ప్రవేశాలకు గాను దోస్త్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను కాలేజీ విద్యాశాఖ కమిషనర్ దేవసేన సోమవారం ప్రకటించింది. ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

ఇంటర్ అడ్మిషన్ల గడువు

ఇంటర్ ఫస్టియర్‌లో ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలకు అధికారులు గడువు పొడిగించారు. ఈనెల 30వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అవకాశం కల్పించారు. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పొందాలనుకున్న వారికి మాత్రమే అధికారులు లేట్ ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు. కాగా, ప్రైవేట్ కాలేజీల్లో చేరేవారు రూ.500 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.


Similar News