కేయూ హాస్టల్‌ను పరిశీలించిన రిజిస్ట్రార్ మల్లారెడ్డి.. తీవ్ర ఉద్రిక్తత

హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

Update: 2024-07-13 05:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కేయూ పోతన బాలికల హాస్టల్‌లో అర్థరాత్రి స్లాబ్ కుప్పకూలిన ఘటనపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా శనివారం కేయూలోని రాణిరుద్రమ దేవి హాస్టల్‌ను రిజిస్ట్రార్ మల్లారెడ్డి పరిశీలించారు. అయితే హాస్టల్‌కు వచ్చిన కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని విద్యార్థులు అడ్డుకున్నారు. హాస్టళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రిజిస్ట్రార్ గో బ్యాక్ అంటూ విద్యార్థి సంఘాలు నినాదాలు చేశారు. కేయూ రిజిస్ట్రార్‌తో విద్యార్థి సంఘాల నేతలు వాగ్వివాదానికి దిగారు. కాగా, రిజిస్ట్రార్ రాకతో కాసేపు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.      


Similar News