రికార్డు ధర.. రూ.1.87 కోట్లు పలికిన లడ్డూ

హైదరాబాద్ బండ్లగూడలో గణేష్ లడ్డూ రికార్డు ధర పలికింది. ఏకంగా రూ.1.87 కోట్లు పలికింది.

Update: 2024-09-17 03:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బండ్లగూడలో గణేష్ లడ్డూ రికార్డు ధర పలికింది. ఏకంగా రూ.1.87 కోట్లు పలికింది. బండ్లగూడలో కీర్తి రిచ్మండ్ విల్లాస్‌ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద లడ్డూ వేలం నిర్వహించగా 25 మంది ఓ గ్రూప్‌గా ఏర్పడి ఈ భారీ ధరకు లడ్డూను సొంతం చేసుకున్నారు. కాగా.. ఇక్కడ గతేడాది కూడా గణేష్ లడ్డూ రూ.1.26 కోట్ల భారీ ధర పలికింది. కాగా.. లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బుతో పేదలకు సహాయం చేయనున్నట్లు ట్రస్ట్ ప్రకటించింది. పేద ప్రజలు, హాస్టల్స్‌లో విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన వినాయక వేడుకలు ఈ రోజు (మంగళవారం)తో ముగిశాయి. అనేక చోట్ల వేడుకగా గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. 


Similar News