రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం

Update: 2022-01-23 10:20 GMT

దిశ, మర్పల్లి: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మర్పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ అన్నారు. ఆదివారం మర్పల్లి మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండలంలో జోరుగా సభ్యత్వం చేయించి నియోజకవర్గంలోనే మర్పల్లిని అగ్రగామిగా నిలుపుతామన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం కృషి చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, బీజేపీలు రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకుంటున్నాయని విమర్శించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ప్రసాద్ కుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తంగేడిపల్లి గణేష్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు సర్వేశ్వర్, సుధీర్, యువజన కాంగ్రెస్ నాయకులు రాఘవేందర్, బల్వంత్ రెడ్డి, తక్కలి శివ, తులసి దాస్, రాజేందర్ గౌడ్, జి సుధాకర్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News