బండి సంజయ్​ కాన్వాయ్​ ని అడ్డుకున్న పోలీసులు..

తాండూరు బీజేపీ నాయకులు మురళీదర్​ గౌడ్ ను పరామర్శించేందుకు వెళ్తున్నబీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్​ కుమార్​ కాన్వాయ్​ ని పరిగి డివిజన్​ పూడూరు మండలం మన్నెగూడ చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు.

Update: 2023-02-22 17:02 GMT

దిశ, పరిగి : తాండూరు బీజేపీ నాయకులు మురళీదర్​ గౌడ్ ను పరామర్శించేందుకు వెళ్తున్నబీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్​ కుమార్​ కాన్వాయ్​ ని పరిగి డివిజన్​ పూడూరు మండలం మన్నెగూడ చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు మా కాన్వాయ్​ ని ఎందుకు ఆపావంటూ ప్రశ్నించారు. ఎవరు అమన్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు ఏమీ సమాదానం చెప్పకుండా పోన్​ లో సార్​ తో మాట్లాడుతున్నానంటూ చెప్పారు. ఏసారుతో మాట్లాడుతున్నావు. ఆసారునే ఇక్కడికి రమ్మని చెప్పు అంటూ పోలీసులను బీజేపీ నాయకులు చెప్పారు. పోన్​ లో మాట్లాడిన అనంతరం బండి సంజయ్​ కాన్వాయ్​ ని వదిలేశారు.

దీంతో బీజేపీ నాయకులంతా పోలీసుల తీరునుతప్పుపట్టారు. కేసీఆర్​ నియంత పాలనకు పోలీసులు కూడా వత్తాసు పలకడం కరక్టు కాదంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ గుండాల దాడిలో గాయపడ్డ బీజేపీ నాయకుడు మురళీగౌడ్​ ను పరామర్శించేందుక వెళ్తున్నామని పరామర్శకు వెళ్తుంటే అడ్డగించుడేందంటూ జిల్లా పోలీసుల తీరునై బీజేపీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. కాగా ఈ విషయమై ఎస్​ఐ పి.విఠల్​ రెడ్డిని ప్రశ్నించగా వాహనాలను తనిఖీ చేస్తున్నామని అందులో బాగంగా ఎవరు అని చూసి వదిలేసి ఉంటారని తెలిపారు.

Tags:    

Similar News