టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలని రాష్ట్రపతికి లేఖ..

టీఎస్పీఎస్సీ బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలని కోరుతూ ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి ఎన్ఎస్ యూఐ నాయకులు రాష్ట్రపతికి లేఖ పంపారు.

Update: 2023-04-27 11:59 GMT

దిశ, ఆమనగల్లు: టీఎస్పీఎస్సీ బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలని కోరుతూ ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి ఎన్ఎస్ యూఐ నాయకులు రాష్ట్రపతికి లేఖ పంపారు. ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకు గురువారం వివిధ మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని కోరుతూ రాష్ట్రపతి ముర్ముకు రిజిస్టర్ పోస్టు పంపారు.

పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిందితులను శిక్షించాలని లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రమేష్ నాయక్, షాబుద్దీన్, ఫరీద్, నాయకులు రాజేష్, ఇమ్రాన్, బాబా, వంశీ, సత్యం, శివ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు

Tags:    

Similar News