dogs attack : ఒకే గంటలో ఐదుగురిని కరిసిన కుక్కలు
రోజు రోజుకు ప్రజలు రోడ్లపై నడవాలంటే కుక్కలను చూసి భయాందోళనకు గురవుతున్నారు.
దిశ,షాద్ నగర్ : రోజు రోజుకు ప్రజలు రోడ్లపై నడవాలంటే కుక్కలను చూసి భయాందోళనకు గురవుతున్నారు. అలాంటి భయానక వాతావరణమే గురువారం కొందుర్గు మండల కేంద్రంలోని చౌరస్తాలో ఉదయం ఏడు గంటల సమయంలో చోటు చేసుకుంది. నిత్యావసర సరుకుల కోసం రోడ్డుపైకి వచ్చిన కర్నూల్ కి చెందిన గురు రాజన్ తాపీ మేస్త్రీ పని చేస్తూ జీవిస్తున్నాడు. ఇతడిపై కుక్క దాడి చేయడంతో కాలుకి తీవ్ర గాయం అయింది.
అలాగే అటుగా ఆటో దిగి వస్తున్న ముత్యాలమ్మ అనే మహిళపై ఎగబడి కరిసింది. అనంతరం మరో ముగ్గురిని కరవడంతో వారు హాస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. పలుమార్లు గ్రామపంచాయతీలో కుక్కల బారి నుండి కాపాడలని, మాంసపు వ్యర్ధాలను రోడ్డుపక్కలో వేయకుండా చర్యలు చేపట్టాలంటూ పలుమార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించిన పాపాన పోలేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు కుక్కల బారి నుండి కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.