కార్పొరేటర్‌లపై దాడి.. 8 మందిపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు

బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ కార్పొరేటర్ల పై దాడి కేసులో మాజీ

Update: 2024-07-03 15:50 GMT

దిశ, రాజేంద్రనగర్ : బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ కార్పొరేటర్ల పై దాడి కేసులో మాజీ మేయర్ మహేందర్ గౌడ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి హరీష్ గౌడ్ తో పాటు ఎనిమిది మంది పై రాజేంద్రనగర్ పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. కార్పొరేటర్ చంద్రశేఖర్ ను కులం పేరుతో దూషించి దాడి చేసిన 8 మంది పై పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. హరీష్ గౌడ్, మాజీ‌ మేయర్ మహేందర్ గౌడ్, శివ గౌడ్, రాము గౌడ్, మల్లేష్ గౌడ్, రాజు శ్రీనివాస్ గౌడ్, పండరీ నాథ్ గౌడ్, గోకరి సురేష్ గౌడ్ తో పాటు పలువురి పై 323, 504 రెడ్ విత్ 34 ఐపీసీ తో పాటు ఎస్సి, ఎస్టీ పిఓఎ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అయితే వీరందరిని త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉంది.


Similar News