రామోజీరావు అంటే క్రమశిక్షణ.. సమయ పాలన.. : వెంకయ్యనాయుడు

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (88) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు.

Update: 2024-06-08 02:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (88) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కాగా, ఆయన మృతి పట్ల మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు అంటే క్రమ శిక్షణ, సమయపాలన, నిబద్ధత అని ఆయన అన్నారు. అడుగుపెట్టిన ప్రతిరంగంలో సరికొత్త ఒరవడి సృష్టించారని వెంకయ్యనాయుడు కొనియాడారు. తెలుగు భాష-సంస్కృతులకు రామోజీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రామోజీఫిల్మ్ సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగు ఘనత చాటారని కొనియాడారు. రామోజీ వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగారన్నారు. తెలుగు వారందరికీ గర్వకారణం.. రామోజీరావు అన్నారు. 


Similar News