టీ-బీజేపీ చీఫ్ పోస్ట్‌పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

దేశం, ధర్మంపై అవగాహన ఉన్న వ్యక్తిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

Update: 2024-06-21 15:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశం, ధర్మంపై అవగాహన ఉన్న వ్యక్తిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని బీజేపీ అధిష్టానానికి శుక్రవారం ఒక వీడియో ద్వారా సూచించారు. కొద్దిరోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం చేస్తారనే ప్రచారం జరుగుతోందని, కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీ నేతలతో పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోందన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఇతర సినీయర్ నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలన చూశారని, కాంగ్రెస్ పాలన చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకే అధికారం ఖాయమని రాజాసింగ్ ధీమా వ్యక్తంచేశారు.


Similar News