బోనాల పండుగ వేళ హిందువులకు రాజాసింగ్ కీలక పిలుపు

బోనాల ఉత్సవాల్లో హలాల్ చేయనీయొద్దని, హిందు పద్ధతిలోనే చేపట్టాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

Update: 2024-06-30 16:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బోనాల ఉత్సవాల్లో హలాల్ చేయనీయొద్దని, హిందు పద్ధతిలోనే చేపట్టాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆయన ఆదివారం ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ సంవత్సరం తెలంగాణలో బోనాల ఉత్సవాల్లో ఎట్టి పరిస్థితిలోనూ హలాల్ జరగడానికి వీలులేకుండా చూడాలన్నారు. గొర్రెను బలిచ్చేది ఎవరనే అంశాన్ని కూడా హిందువులు ముందుగానే చూసుకోవాలన్నారు. ఎందుకంటే బలిచ్చే వారు ముస్లిం అయితే అతడు తన మనస్సులో అయినా గొర్రెను అల్లాకు సమర్పిస్తున్నానని చెబుతాడన్నారు. అలా జరిగిందంటే ఎంగిలి నైవేద్యం అమ్మవారికి పెట్టినట్లవుతుందన్నారు. అందుకే హలాల్ చేయనీయొద్దని సంకల్పాన్ని హిందు సమాజం తీసుకోవాలని ఆయన కోరారు.


Similar News