Yadagiri Gutta : యాదగిరి లక్ష్మినరసింహుడిని దర్శించుకున్న ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్

యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి(Yadagiri Gutta Sri Lakshminarasimha Swamy)ని ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్(AP Minister Vasamshetty Subhash) దర్శించుకున్నారు.

Update: 2024-10-26 09:09 GMT

దిశ, వెబ్ డెస్క్ : యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి(Yadagiri Gutta Sri Lakshminarasimha Swamy)ని ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్(AP Minister Vasamshetty Subhash) దర్శించుకున్నారు. గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకున్న మంత్రి సుభాష్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చక పండితులు వేదాశీర్వచనం పలికారు. ఈవో భాస్కర్ రావు లడ్డూ ప్రసాదాలను, స్వామి వారి జ్ఞాపికను అందించారు.

కేంద్ర ఇన్ కామ్ టాక్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆనంద రాజేశ్వరీ భావారీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సబితలు కూడా శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు, దర్శనానంతరం పండితులు ఆశీర్వచనం చేయగా, ఈవో స్వామి వారి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు. 

Tags:    

Similar News