Rain Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. ఆ జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం రాగా 24 గంటల్లో ఓడిశా వెంబడి తీరం దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

Update: 2024-07-19 12:39 GMT
Rain Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. ఆ జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం రాగా 24 గంటల్లో ఓడిశా వెంబడి తీరం దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతం రాష్ట్ర వాప్తంగా పలు జిల్లాల్లో తెలికపాటి నుంచి అత్యంత భారీ వర్షాలు కురసే అవకాశం ఉన్నట్లుగా ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దీంతో అప్రమత్తమైన అధికారులు అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కరిసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

Tags:    

Similar News