Protocol dispute: పోలీస్ అధికారులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వీరేశం

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన ప్రోటోకాల్ వివాదం (Protocol dispute)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం(MLA Veeresham) సీరియస్ అయ్యారు.

Update: 2024-09-04 08:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన ప్రోటోకాల్ వివాదం (Protocol dispute)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం(MLA Veeresham) సీరియస్ అయ్యారు. ఈ విషయంపై ఈ రోజు మినిస్టర్స్ క్వాటర్స్‌లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, బత్తుల లక్ష్మారెడ్డిలతో పాటు ఎమ్మెల్యే వీరేశం కలిశారు. అనంతరం ఆగస్టు 30న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన ఇరిగేషన్ సమీక్ష సమావేశం సందర్భంగా.. మంత్రుల కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఎమ్మెల్యే వీరేశం ను పోలీసులు వెళ్ళనివ్వకపోవడం పై ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో పలువురు పోలీస్ అధికారులు ఎమ్మెల్యేల పట్ల ప్రోటోకాల్ పాటించడం లేదని తెలిపారు.


Similar News