ప్రభుత్వానికి ప్రొ. కోదండరామ్ కీలక సూచన

రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ప్రొ. కోదండరామ్(Pro. Kodandaram) కీలక సూచనలు చేశారు.

Update: 2024-09-24 11:10 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ప్రొ. కోదండరామ్(Pro. Kodandaram) కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు సత్వరమే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కోరారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన వివిధ రకాల పెండింగ్ బిల్లులు రూ.4 వేల కోట్ల దాకా ఉన్నాయని, వాటన్నిటిని తక్షణమే విడుదల చేయాలన్నారు. కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు తీసుకు వచ్చిన 317 జీవో(317 GO) ద్వారా అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని, బాధితులకు న్యాయం చేకూర్చే బాధ్యత ప్రభుత్వానిదే అని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంచనా వేస్తూనే.. వారి సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోదండరామ్ అభిప్రాయ పడ్డారు.  


Similar News