PCC chief: 'ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే'.. పొంగులేటిపై ఈడీ రెయిడ్స్ పై మహేశ్ కుమార్ గౌడ్

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ కొనసాగిస్తున్న దాడులపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.

Update: 2024-09-27 11:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి పొంగులేటిపై ఈడీ రెయిడ్స్ పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ సలహాల మేరకే ఈడీ రెయిడ్స్ జరుగుతున్నాయని ఆరోపించారు. ఇదంతా కక్ష్య పూరిత చర్యల్లో భాగంగానే కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారహు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం మంచిది కాదని హెచ్చరించారు. పదేండ్ల ఈడీ దాడుల్లో 97 శాతం దాడులు ప్రతిపక్ష నాయకులపై జరిగినవే అని రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.


Similar News