PCC chief: ఢిల్లీ బయల్దేరిన పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్(PCC chief Mahesh Kumar Goud) శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు.

Update: 2024-10-25 06:44 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్(PCC chief Mahesh Kumar Goud) శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే పర్యటించనున్నట్లు తెలుస్తుంది. అక్కడకు చేరుకున్న అనంతరం రెస్ట్ తీసుకొని.. కాంగ్రెస్ పార్టీ(congress) పెద్దలను కలవనున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో కార్యవర్గం కూర్పు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జగిత్యాల కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(jeevan reddy) వ్యవహారంపై కూడా ఆయన పార్టీ నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తుంది. కాగా ఆయన ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News